భారతదేశం, ఆగస్టు 27 -- నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి ఉద్ధృతంగా దూసుకొచ్చిన భోటే కోశి నది, సరిహద్దు జిల్లాలైన రసువా, ధాడింగ్, నువాకోట్‌లలో కనురెప్పపాటులో వినాశనం సృష్టించింది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలు.. గ్రామాలు, ప్రధాన రహదారులు, కీలక వంతెనలను తుడిచిపెట్టేశాయి. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 157 మృతదేహాలను వెలికితీయగా, వందలాది మంది ఆచూకీ లభించలేదు. వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నేపాల్​లో ఈ ప్రకృతి విపత్తులో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టూరిజం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత...