భారతదేశం, ఏప్రిల్ 18 -- Nagababu Prakash Raj: శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్లు చేసినందుకు ప్రకాష్ రాజ్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీసులకు ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ కామెంట్లపై మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు ఫైర్ అయ్యాడు.

శ్రీ రాముడి గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్ అంటూ ఎక్స్ వేదికగా నాగబాబు ఫైర్ అయ్యాడు.

''మిస్టర్ ప్రకాష్ రాజ్, మిమ్మల్ని మీరు 'క్రిస్టియన్ నాస్తికుడిని' అని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించారు. ఒక కుమారుడిగా మీరు చేసిన ఆ పనిని మేమూ గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో, మీరు కోట్ల మంది ప్రజల నమ్మకాలను కూడా గౌరవించాలి'' అని నాగబాబ...