భారతదేశం, ఏప్రిల్ 13 -- సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం ఉగాండా సైన్యాధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు యోవేరి ముసెవేని కుమారుడైన ముహూజీ కైనెరుగాబాకు అలవాటే. అయితే ఈసారి ఆయన నేరుగా టర్కీ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,300 కోట్లు) "సెక్యూరిటీ డివిడెండ్" చెల్లించాలన్నారు. అంతేకాదు, ఆ దేశంలోని అత్యంత అందగత్తెను తనకు భార్యగా అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం 30 రోజుల సమయాన్ని ఇస్తున్నట్టు, ఆలోగా తన డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గత రెండు దశాబ్దాలుగా సోమాలియాలో అల్-షబాబ్ ఉగ్రవాదులతో ఉగాండా సైన్యం పోరాడుతుంటే, ఆ పోరాటం వల్ల టర్కీ లబ్ధి పొందుతోందని ముహూజీ ఆరోపించా...