Monsoon : రుతుపవనాలపై ఎల్ నినో దెబ్బ- 2 దశాబ్దాల్లోనే అతి తక్కువ వర్షపాతం!
భారతదేశం, ఆగస్టు 25 -- భారతీయ వ్యవసాయానికి జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈసారి తీవ్ర నిరాశను మిగిల్చేలా ఉన్నాయి! గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత బలహీనంగా ఈసారి రుతుపవనాలు ముగియనున్నట్లు వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం దాదాపు 15 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, 2009 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి అని ఇద్దరు సీనియర్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశంలో వ్యవసాయానికి వర్షాలే ప్రధాన ఆధారం. దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70శాతం ఈ రుతుపవనాల ద్వారానే వస్తుంది. వర్షాలు ఇలా తగ్గిపోతే పంట దిగుబడులు దెబ్బతినడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం తగ్గి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టే అవకా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.