భారతదేశం, మార్చి 12 -- ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో 'రుద్రాక్ష మాల' అమ్ముతూ ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోంస్లే (మొని) పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన ఆమె.. బుధవారం (మార్చి 11) సాయంత్రం కేరళలోని పూవార్ సమీపంలో ఉన్న అరుమనూర్ నయనార్ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. గురువారం మీడియాతో మాట్లాడింది.

ఈ జంట మతాలు వేరు కావడంతో 'లవ్ జిహాద్' అంటూ వస్తున్న విమర్శలపై మోనాలిసా స్పష్టతనిచ్చింది. "నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మాది లవ్ జిహాద్ కాదు. హిందూ సంప్రదాయాల ప్రకారమే మేము వివాహం చేసుకున్నాం. నన్ను ఇస్లాం మతంలోకి మారమని ఫర్మాన్ ఎప్పుడూ అడగలేదు" అని ఆమె స్పష్టం చేసింది.

తమ వయసు గురించి వస్తున్న సందేహాలకు చెక్ పెడుతూ.. 2008లో పుట్టినట్లు ఉన్న తన బర...