భారతదేశం, మే 2 -- Monalisa: కుంభమేళా అమ్మాయిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల ఆమె చుట్టూ నెలకొన్న పరిణామాల్లో మరో ట్విస్ట్ చేసుకుంది. తేనే కళ్లతో రాత్రికి రాత్రి వైరల్ అయిపోయి బ్యూటీ.. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మోనాలిసాను హీరోయిన్ గా మార్చి, ఇండస్ట్రీకి పరిచయం చేయాలని 'ది డైరీ ఆఫ్ మణిపూర్' మూవీ తీసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. అతనితో పాటు ముగ్గురిపై ఆమె పోక్సో (POCSO) చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతం మధ్యప్రదేశ్ కావడంతో విచారణను అక్కడికి బదిలీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల...