భారతదేశం, ఫిబ్రవరి 25 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రేపు (ఫిబ్రవరి 26) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గురువారం ఉదయ్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు రష్మిక, విజయ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఓ స్పెషల్ లెటర్ ద్వారా పీఎం తన ఆశీర్వాదాన్ని పంపించారు.

విరోష్ వెడ్డింగ్ సందర్భంగా మందన్న, దేవరకొండ కుటుంబాలకు, కాబోయే కొత్త దంపతులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ లెటర్ ను పంపించారు. ఈ లేఖను విజయ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది" అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.

"2026 ఫిబ్రవరి 26న జరగనున్న విజయ్, రష్మికల వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఎంతో సంతోషకరమై...