భారతదేశం, ఆగస్టు 10 -- స్టాక్ మార్కెట్​ ఇన్వెస్టర్లకు అప్డేట్! ప్రముఖ డైరీ ఉత్పత్తుల బ్రాండ్ 'మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్స్' ఐపీఓ రేపటి నుంచి (ఆగస్టు 11, మంగళవారం) సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 13 (గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది.

రూ. 1,553 కోట్ల పబ్లిక్ ఆఫర్ కోసం కంపెనీ షేరు ధర రూ. 133 నుంచి రూ. 140 వరకు ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఈ ప్రైస్ బ్యాండ్ ప్రకారం.. ఐపీఓ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 10,310 కోట్ల నుంచి రూ. 10,778 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మిల్కీ మిస్ట్ ఐపీఓలో భాగంగా రూ. 1,428 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) కింద రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తంగా ఈ ఇష్యూ సైజ్ రూ. 1,553 కోట్లు...