భారతదేశం, మార్చి 31 -- Meenakshi Sheshadri: బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ ఒకప్పుడు వెలుగు వెలిగిన అందాల తార మీనాక్షి శేషాద్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 1988లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'షెహెన్షా'లోని తన సూపర్ హిట్ సాంగ్ 'హే యూ'ను 62 ఏళ్ల వయసులో ఆమె రీక్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా వైరల్‌గా మారింది. 80వ దశకంలో తన నటనతో, డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన మీనాక్షి.. నేటికీ అదే గ్రేస్, అదే ఎనర్జీని ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు వయసును ఉద్దేశించి చేసిన కామెంట్లకు ఆమె అభిమానులు గట్టిగా సమాధానమిచ్చింది.

ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి కాంబినేషన్‌లో వచ్చిన 'షెహెన్షా' మూవీ బాలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్. ఈ సినిమా ...