భారతదేశం, జనవరి 30 -- మేడారం జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. జాతరలో అత్యంత కీలమైన వనదేవతల రాక పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపైన ఉన్న వనదేవతలను భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.

గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆధ్వర్యంలో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర మంత్రులు ...