భారతదేశం, మే 2 -- సాధారణంగా ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తుంటాయి. కానీ, ఈ మే నెలలో వచ్చే ఏకాదశులు భక్తులకు అత్యంత ప్రత్యేకం. అటు జ్యేష్ఠ మాసం, ఇటు అరుదుగా వచ్చే అధిక మాసం కలయికతో ఈ నెలలో ఏకాదశి వ్రతాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ఈ తరుణంలో అపర మరియు పద్మిని ఏకాదశుల తేదీలు, ముహూర్తాలపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ సమగ్ర సమాచారం మీకోసం.

మన సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అయితే, మే నెలలో ఎండలు మండుతున్న సమయంలో వచ్చే ఈ ఏకాదశుల నాడు 'జల దానం' చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, బాటసారులకు నీరు, మజ్జిగ అందించడం వంటి పనులు చేయడం వల్ల సకల పాపా...