భారతదేశం, జూన్ 13 -- Maruti Suzuki AI Technology : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భవిష్యత్తు మార్కెట్‌ను శాసించేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న పోటీని తట్టుకోవడంతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త వాహనాలను మరింత వేగంగా, అత్యంత సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను రంగంలోకి దించుతోంది.

రాబోయే కొద్ది సంవత్సరాల్లో తన ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) శ్రేణిని భారీగా విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న మారుతీ సుజుకీకి ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ ఎంతో కీలకం కానుంది.

సాధారణంగా ఒక సరికొత్త కారును మార్కెట్​లోకి తీసుకురావడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో డిజైన్ రూపకల్పన, టెస్టింగ్, వ్యాలిడేషన్, ప్రొడక్షన్ ప్లానింగ్ వంట...