భారతదేశం, మార్చి 27 -- ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీస్ ను బాగా ఆదరిస్తారు. ఇక అందులోనూ మలయాళం థ్రిల్లర్లు అంటే పడిపడి చూస్తారు. ఈ రోజు (మార్చి 27) అలాంటి రెండు మలయాళం థ్రిల్లర్లు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా, మరొకటి సైన్స్ ఫిక్షన్ మూవీ.

జీతూ జోసెఫ్.. ఈ మలయాళ డైరెక్టర్ పేరు తెలియని మూవీ లవర్ ఉండడనే చెప్పొచ్చు. దృశ్యం లాంటి థ్రిల్లర్ ను అందించింది అతనే. ఇప్పుడీ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'వలతు వశతే కల్లన్' ఓటీటీలోకి వచ్చేసింది.

'వలతు వశతే కల్లన్' మూవీ ఏకంగా మూడు ఓటీటీల్లో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ మూవీ రిలీజైంది. ఇందులో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిం...