భారతదేశం, మార్చి 20 -- బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ స్టార్ల ప్రశంసలతో నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది.

ధురంధర్ 2 సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. "ధురంధర్ 2 అద్భుతంగా పేలింది! రణ్‌వీర్ సింగ్ తన అత్యుత్తమ వెర్షన్‌ను బయటపెట్టాడు. ఆదిత్య ధర్ విజన్, మేకింగ్ స్టైల్ నన్ను ఆశ్చర్యపరిచాయి. మాధవన్ యాక్టింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి" అని మహేష్ బాటు ఎక్స్ లో రాసుకొచ్చాడు.

ఆదిత్య ధర్ మహేష్ బాబు ప్రశంసలకు స్పందిస్తూ.. "మీ మాటలకు కృతజ్ఞతలు మహేష్. ధురంధర్ ను ఇంత బ...