భారతదేశం, జూలై 26 -- Mahesh Babu: సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని, దివంగత రమేష్ బాబు జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ మూవీ జూలై 30న రిలీజ్ కానుంది.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ సీనియర్ భామ రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా తన అన్న కొడుకు సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా వీడియో మెసేజ్ విడుదల చేస్తూ మేకర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌తో తమ ...