భారతదేశం, జూలై 12 -- Maa Inti Bangaram OTT: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన సమంత 'మా ఇంటి బంగారం' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జూన్ 19న థియేటర్లలోకి వచ్చి.. కేవలం ఒక సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది.

గత కొన్ని రోజులుగా మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ పార్ట్‌నర్ గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ చిత్రం సరికొత్త ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో జూలై 17 నుంచి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "ఒక్కొక్కడ్ని కొడతాము చూడు.. ప్రేమతో అబ్బా" అంటూ సమంత క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఈ డిజిటల్ అరైవల్‌ను అధికారికంగా...