భారతదేశం, మార్చి 14 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకే, ఇప్పుడు సోషల్​ మీడియాలో 'కట్టెల పొయ్యి' ఫొటోలు, వీడియోలు వైరల్​గా మారుతున్నాయి. దేశంలో శతాబ్దాల పాటు అవే వినియోగంలో ఉండేవి. ఆ తర్వాతే ఎల్​పీజీ సిలిండర్ల విప్లవం వచ్చింది. అయితే ఈ 'ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్' వెనుక ప్రపంచాన్ని మార్చేసిన మిస్టరీ ఒకటుందని మీకు తెలుసా?

ఎల్‌పీజీ సిలిండర్ ప్రస్థానం చాలా వింతగా, ఒక సామాన్యమైన సంఘటనతో మొదలైంది. 20వ శతాబ్దపు ప్రారంభంలో, అమెరికాలో ఒక వాహనదారుడు గ్యారేజీకి వెళ్లి ఒక వింత ఫిర్యాదు చేశాడు. తను పెట్రోల్ ట్యాంక్ నిండా ఇంధనం పోయించానని, కానీ అది ఎక్కడా వాడకపోయినా చాలా వేగంగా తగ్గిపోతోందని చెప్పాడు. అది విన్నవారందరికీ ఆశ్చర్యం కలిగింది.

ట్యాంక్‌లో ఎక్కడా లీకేజీ లేద...