భారతదేశం, ఏప్రిల్ 14 -- Little Hearts Mouli: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు తన ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు మౌళి తనూజ్ ప్రశాంత్. తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మౌళి.. ఇప్పుడు టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో హీరోగా నటించబోతున్నాడు. దీనికి దొంగ నా కొడుకు అనే టైటిల్ పెట్టడం విశేషం. 'పుష్ప' వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ను నమ్మి ప్రాజెక్ట్ ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల విడుదలైన 'లిటిల్ హార్ట్స్' మూవీలో మౌళి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో అతడు చూపించిన ఈజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సక్సెస్ మీట్లలో కూడా మౌళికి దక్కిన రెస్పా...