భారతదేశం, ఏప్రిల్ 15 -- మరణం అంటే జీవితం ముగిసిపోవడమేనా? లేక మరో కొత్త ప్రయాణానికి ఆరంభమా? ఈ ప్రశ్న మానవజాతిని అనాదిగా వేధిస్తోంది. విజ్ఞాన శాస్త్రం భౌతికమైన ముగింపు గురించి మాట్లాడితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలు శరీరం తర్వాత కూడా జీవితం కొనసాగుతుందని నమ్ముతాయి. ఆత్మన్ అవేర్‌నెస్ సెంటర్ వ్యవస్థాపకులు హెచ్​హెచ్ గురుజీ సుందర్ తన బోధనల ద్వారా ఈ రహస్యాలను వివరిస్తున్నారు.

మరణం అనేది ఉనికికి ముగింపు కాదని, అది ఆత్మ సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ఒక భాగం మాత్రమేనని గురుజీ సుందర్ పేర్కొంటారు. "జీవితం మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. జీవితం శాశ్వతమైనది, అది జనన మరణాల మధ్య బందీ కాదు. జీవశక్తిని ఎవరూ నాశనం చేయలేరు, కేవలం భౌతిక రూపాలు మాత్రమే మారుతుంటాయి," అని ఆయన వివరించారు.

"శరీరం ముసలిదైనా లేదా బలహీనపడినా, లోపల ఉన్న జీవశక్తి ఆ భౌతిక ...