భారతదేశం, జూలై 1 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 250 పాయింట్లు పడి 76,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు కోల్పోయి 23,866 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 184 పాయింట్లు పడి 57,543 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,556.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,842.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీకి 23,800 దగ్గర కీలక సపోర్ట్, 24,350 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. ఈ రెసిస్టెన్స్​ బ్రేక్ అయితేనే సూచీ పెరగొచ్చు," అని ప్రభుదాస్ ...