భారతదేశం, మార్చి 29 -- మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరిట లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బెదిరింపుల రాజకీయాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ సమావేశంలో మాట్లాడిన ఆయన. తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.

మూసీ ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న అవినీతి పై కేటీఆర్ ఆందోళన...