భారతదేశం, ఆగస్టు 9 -- యూరప్‌లోని అందమైన ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లోని రోడ్డుపై వెళ్తున్న ఒక కొత్త కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే.. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ హైబ్రిడ్! ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌లో వస్తున్న ఈ ఎస్‌యూవీని కంపెనీ తొలిసారి రోడ్డు పరీక్షలకు పంపింది. ఈ నేపథ్యంలో ఎస్​యూవీకి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి.

ఈ ఏడాది చివరి నాటికి ఈ కియా సెల్టోస్ హైబ్రిడ్ కారు గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇక మన దేశంలోని కార్ల ప్రియుల కోసం 2027 నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెట్రోల్, డీజిల్ సెల్టోస్ మోడళ్లతో పాటు ఇది కూడా విక్రయానికి రానుంది. కియా ఇండియా లైనప్‌లో ఇదొక కీలకమైన మోడల్‌గా నిలవనుంది.

సాధారణ సెల్టోస్ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్ వెర్షన్ రూపంలో పెద్దగా తేడాలు కనిపించవు. ము...