భారతదేశం, జూన్ 3 -- Khushbu Vijay: సినిమా ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ పాలిటిక్స్‌కు సంబంధం లేకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది ఈ లేటెస్ట్ మీటింగ్. సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తన 'తమ్ముడు', తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్‌ని ఆయన ఇంట్లో స్పెషల్‌గా కలిశారు. తన కూతురు అవంతిక పెళ్లికి తప్పకుండా రావాలని విజయ్‌కు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.

ఈ స్పెషల్ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఖుష్బూ తన ఎక్స్ అకౌంట్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

"మా ఫ్యామిలీకి ఇది నిజంగా ఎంతో స్పెషల్, ఎప్పటికీ మర్చిపోలేని రోజు. నా ప్రియమైన తమ్ముడు, తమిళనాడు గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారిని ఆయన ఇంట్లో కలిసి మా కూతురు అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్‌ల వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాము. విజయ్‌ను చూడటం ఎప్పు...