భారతదేశం, జూలై 5 -- ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఖమేనీ హతమయ్యారు. ఆయన మరణించిన తర్వాత భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం అధికారికంగా ఉంచడానికి దాదాపు 125 రోజులు, అంటే 4 నెలలకు పైగా సమయం పట్టింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నడుమ.. కఠినమైన ఇస్లామిక్ సాంప్రదాయాలను పాటిస్తూనే శవాన్ని ఇన్నాళ్ల పాటు చెడిపోకుండా ఉంచడం అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది! మరి ఇరాన్ దీనిని ఎలా సాధించింది?

సాధారణంగా మృతదేహాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి రసాయనాలను ఉపయోగించి 'ఎంబాల్మింగ్' ప్రక్రియను చేస్తారు. కానీ, ఖమేనీ, ఆయనతో పాటు మరణించిన...