భారతదేశం, మే 11 -- వారణాసి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కాశీ విశ్వనాథుడు, గంగా నది. అయితే, ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే తెలుగు భక్తులతో పాటు దేశవ్యాప్త యాత్రికులు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన మరో ముఖ్యమైన ఆలయం ఉంది. అదే 'సాక్షి వినాయక ఆలయం'. ఇక్కడ వినాయకుడు భక్తుల రాకను గమనించి, సాక్ష్యంగా నిలుస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను 'సాక్షి వినాయకుడు' అని పిలుస్తారు. మీరు కాశీకి వచ్చారని సాక్షి వినాయకుడి దగ్గర హాజరు వేయించుకోకపోతే, ఆ యాత్రకు పూర్తి ఫలం దక్కదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం చాలా ప్రత్యేకం. సాధారణంగా మనం చూసే వినాయకుడి చేతుల్లో ఆయుధాలు లేదా మోదకాలు ఉంటాయి. కానీ, ఇక్కడ స్వామివారు ఒక చేతిలో కలము (పెన్ను), మరో చేతిలో పుస్తకాన్ని పట్టుకుని కనిపిస్తారు.

కాశీ క్షేత్రానికి ఏ భక్తుడు వచ్చాడు? ఏ పనులు చేశాడు? అనే వ...