భారతదేశం, ఏప్రిల్ 3 -- కార్తీక దీపం 2 సీరియల్ లో దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. మరోవైపు సుమిత్ర, జ్యోత్స్న, దీప డీఎన్ఏ టెస్టులు చూసి కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్నకు నిజం తెలిసిందని అనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో టుడే ఏప్రిల్ 3 కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో చూసేద్దాం.

జ్యోత్స్న డీఎన్ఏ టెస్టు చేయించింది. సుమిత్ర అత్తకు బోన్ మ్యారో తాను ఇవ్వలేదని జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. దీప శాంపిల్స్ కూడా సంపాదించింది. జ్యోత్స్న సైలెంట్ గా లేదు మామయ్య. ఏదో పెద్ద ప్లాన్ లో ఉంది. తాను అసలు వారసురాలు కాదన్న విషయం నాకు, దీపకు తెలుసని తనకు తెలిసిపోయిందని దాసుతో కార్తీక్ కంగారుగా చెప్తాడు.

మరోవైపు మేడ మీద ఉన్న దీప దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది. దీప డేంజర్లో ఉంది మామయ్య, వెంటనే తనను సేవ్ చేయాలని కార్తీక్ పరుగులు పెడతాడు. దీపను చంపడానికి జ్యో...