భారతదేశం, మే 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో పారిజాతానికి నిజం తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. తానే పారు సొంత మనవరాలిని అని దాసుతోనే జ్యోత్స్న చెప్పిస్తుంది. నిజం తెలుసుకున్న పారు.. మళ్లీ జ్యోతో చేతులు కలుపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 13 ఎపిసోడ్ లో చూసేయండి.

నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? నీ బోన్ మ్యారో ఎలా ఇచ్చావ్? మళ్లీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నువ్వు దాసు కూతురివా? సుమిత్ర కూతురివా? అని జ్యోత్స్నను అడుగుతూ పారిజాతం గందరగోళానికి గురవుతుంది. సుమిత్ర ఆపరేషన్ జరిగింది. కన్న కూతురే బోన్ మ్యారో ఇచ్చిందని జ్యోత్స్న అంటుంది.

ఎక్కడో ఉన్న కన్న కూతురు ఎలా ఇచ్చింది? అని పారు టెన్షన్ పడుతుంది. కన్న కూతురు ఎవరో తెలియకపోవచ్చు. కానీ కన్న తల్లి ఎవరో ఆ కన...