భారతదేశం, ఏప్రిల్ 22 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న కిడ్నాప్ డ్రామాతో కథ మలుపు తిరిగింది. ఓ వైపు సుమిత్ర బాధపడుతుంది. దీపపై ఆమె సీరియస్ అవుతుంది. దీంతో జ్యోత్స్నను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కార్తీక్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో చూసేయండి.

జ్యోత్స్న డ్రామా ఆడుతుందని అనుకున్నా. కానీ కూతురి మీద ఆశలు వదిలేసుకోమని కిడ్నాపర్ చెప్పడంతో జ్యోత్స్న నిజంగానే చచ్చిపోతుందేమోనని భయంగా ఉందని దాసు బాధ పడతాడు. నీకేనా, నాకు ప్రేమ లేదు అనుకున్నావా? ఈ భుజాల మీద ఎత్తుకుని పెంచా. జ్యోత్స్న నీ కూతురు అని తెలిసినా తనపై నా ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. రూ.30 కోట్లు ఏంటీ, నా యావదాస్తి అడిగినా రాసి ఇస్తానని దశరథ అంటాడు.

ఎలాగైనా నా కూతురిని కాపాడు అన్నయ్య అని దాసు అంటుండగా...