భారతదేశం, ఏప్రిల్ 23 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్న్స కిడ్నాప్ డ్రామా చుట్టూ సాగుతోంది. దశరథ తెచ్చిన రూ.30 కోట్లను వైరాకు చెందిన వ్యక్తి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఫాలో అయిన కార్తీక్.. జ్యోత్స్న నాటకాన్ని కనిపెట్టాడా? అన్నది కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో చూసేయండి.

డబ్బుతో ఉన్న కారును పోలీసులతో కలిసి దశరథ, దాసు ఫాలో అవుతారు. వాళ్ల వెనకాలే స్కూటీపై కార్తీక్, పారు వస్తారు. ఓ చోట దశరథను కారు ఆగి ఉంటుంది. వెళ్లి చూస్తే కార్లో ఎవరూ ఉండరు. డబ్బు కూడా ఉండదు. బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు సార్. ఫాలో కావొద్దంటూ మీరు వినలేదు. వాడు మన ప్రతి మూమెంట్ ను కనిపెడుతున్నాడని దశరథ చెప్తాడు.

మీరు ఇంటికి వెళ్లండి, మీ కూతురిని మేం సేఫ్ గా తీసుకొస్తామని పోలీసులు చెప్పడంతో దశరథ ఇంటికి వెళ్తాడు. అప్పుడ...