భారతదేశం, మార్చి 20 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. నేను అన్ని ప్లాన్ చేశానని టెన్షన్ పడుతున్నడాక్టర్ కు కార్తీక్ చెప్తాడు. అప్పుడే పారిజాతానికి దాసు ఫోన్ చేస్తాడు. నువ్వు దూరం చేసిన నీ మనవరాలు దొరికిందమ్మా అని పారుకు దాసు అబద్దం చెప్తాడు. హాస్పిటల్ బయటే ఉన్నా అమ్మ అని దాసు చెప్పగానే, పారు వెళ్లిపోతుంది.

పారు బయటకు వెళ్లిపోవడంతో ఆపరేషన్ కోసం దీపను డాక్టర్ హారిక తీసుకెళ్తుంది. శౌర్య ఇచ్చిన బొమ్మను చూస్తూ దీప ఫీల్ అవుతుంది. ఇది వీడ్కోలు కాదు దీప, అత్తకు ఆహ్వానం అని దీపను పంపిస్తాడు కార్తీక్. మరోవైపు పారిజాతం పరిగెడుతూ శివ నారాయణను ఢీ కొడుతుంది. ఎందుకు ఇంత ఆనందం? అని శివ నారాయణ అడిగితే, నా మనవరాలు దొరికిందని పారు చెప్తుంది.

అయ్యో, నోరు జారిందే అని పారు మళ్లీ కవర్ చేస్తుంది. మనవరాలు దొరికింది అన్నావ్ కదా అదేంటో చెప్పు ...