భారతదేశం, ఏప్రిల్ 13 -- Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే ఈ 'బేబో'.. ఇప్పుడు ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విమానాశ్రయంలో సామాన్యుల పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలైతే కొమ్ములుంటాయా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందో చూడండి.

తాజాగా కరీనా కపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కరీనా పీచ్ కలర్ సూట్-సల్వార్ ధరించి, స్టైలిష్ గ్లాసెస్‌తో కనిపించింది. అయితే ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వద్ద ప్రయాణికులందరూ క్యూ లైన్‌లో వేచి చూస్తుండగా.. కరీనా మాత్రం ఆ లైన్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా గేటు వద్దకు వెళ్లింది. ఆమెత...