భారతదేశం, సెప్టెంబర్ 10 -- Kareena Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ నటిగా కొనసాగుతున్న కరీనా కపూర్ ఖాన్ తాజాగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లోని మూస ధోరణిని ఆమె ప్రశ్నించారు. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అదే ఫార్ములాను గుడ్డిగా అనుకరిస్తారని ఆమె విమర్శించారు.

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా హిట్ అవ్వగానే అందరూ వైలెన్స్ ఉన్న కథలే చేయాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని కరీనా కపూర్ హాట్ కామెంట్లు చేశారు.

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని కరీనా అభిప్రా...