భారతదేశం, ఏప్రిల్ 7 -- దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో కోర్టు వెలువరించిన తీర్పుపై మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఉరిశిక్షను సమర్థించనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసు ఒప్పుకోవడం లేదన్నారు.

సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పును కమల్ హాసన్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. అయితే, తన వ్యక్తిగత సిద్ధాంతం ప్రకారం ఉరిశిక్షను తాను సమర్థించనని కమల్ స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ తీర్పుపై కమల్ స్పందిస్తూ, "జయరాజ్, బెన్నిక్స్ అనుభవించిన నరకం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ప్రజలను రక్షించాల్సిన వారే కాలయముళ్లుగా మారడం అత్యంత దారుణం. బాధితుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు ఈ న్యాయ పో...