భారతదేశం, ఏప్రిల్ 24 -- కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో వచ్చే నెలలో అధికారికంగా బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. గుత్తి-పత్తికొండ రహదారికి సమీపంలో ఉన్న జొన్నగిరి ప్రాంతంలో అనేక సర్వేల అనంతరం బంగారం ఉన్నట్టుగా గుర్తించారు. భారతదేశంలోని ప్రముఖ బంగారు గనుల ప్రాంతాలలో ఒకటిగా ఆవిర్భవించడానికి ఇది సిద్ధంగా ఉంది. భారతదేశంలో తొలిసారిగా జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ జొన్నగిరిలో బంగారు తవ్వకాల కార్యకలాపాల్లోకి ప్రవేశించబోతోంది.

ఆంధ్రప్రదేశ్ కోలార్‌గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్.. రాష్ట్ర మైనింగ్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

సుమారు 1,477 ఎకరాల్లో విస్తరించి ఉన్న జొన్నగిరి బంగారు గనుల ప్రాజెక్టు రూ.400 కోట్లకు పైగా పెట్టుబడిని ఆకర్షించింది. ఇది ఒక ప్రధాన రహదారికి సమీపంలో ఉండటం వల్ల ...