భారతదేశం, ఆగస్టు 31 -- రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగానికి చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్'.. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ప్రతిపాదించిన రూ. 37,700 కోట్ల భారీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కి సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' తుది ఆమోదపత్రాన్ని (అబ్జర్వేషన్ లెటర్) జారీ చేసింది. 2026 సంవత్సరం ముగిసేలోగా ఈ ఐపీఓ ప్రాథమిక మార్కెట్‌ను తాకనుంది! భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓగా నిలవనుంది.

ఈ ఏడాది జూన్ 19న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఐపీఓపై కీలక ప్రకటన చేశారు. బోర్డు ఆమోదం అనంతరం అదే రోజు సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను (డీఆర్​హెచ్​పీ) సమర్పించారు. పరిశీలన పూర్తయిన అనంతరం ఆగస్టు 28న సెబీ నుంచి అనుమతి వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాం...