భారతదేశం, జూలై 22 -- Jeetendra: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, 'జంపింగ్ జాక్' జితేంద్ర తన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లాకింగ్ సీక్రెట్‌ను బయటపెట్టారు. ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి హిల్ ఏరియాలో అప్పట్లో కేవలం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన ఒక పాత బంగ్లా విలువ ఇప్పుడు ఏకంగా రూ.450 కోట్లకు చేరుకుందని ఆయన వెల్లడించారు.

'ది రియాల్టీ డ్రైవ్' ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలీవుడ్ నటుడు జితేంద్ర తన సినీ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో 'బైజూ బావ్రా' లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలతో సూపర్ స్టార్‌గా వెలిగిన నటుడు భరత్ భూషణ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ డీల్ కుదిరింది. తన పాలి హిల్ బంగ్లాను అమ్మేయాలని భరత్ భూషణ్ ప్రతిపాదించడంతో జితేంద్ర తన తండ్రితో చర్చించి ఆ ప్రాపర్టీని కొనుగోలు చేశారు...