భారతదేశం, ఏప్రిల్ 18 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇంకో రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 20వ తేదీ లోపు ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఫలితాల కోసం దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ సెషన్-2 (పేపర్-1: బీఈ./ బీటెక్) ఫలితాలు ఏప్రిల్ 20 నాటికి వెలువడే అవకాశం ఉంది. ఈసారి అభ్యర్థుల రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్) ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, అందులో దేనిలో అయితే ఉత్తమ స్కోరు వచ్చిందో దాని ఆధారంగా తుది ర్యాంకులను కేటాయించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు తమ ఉత్తమ ప్రతిభను...