భారతదేశం, ఫిబ్రవరి 27 -- దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ మెయిన్స్​ 2026' సెషన్-2 పరీక్షకు సంబంధించి బిగ్​ అప్డేట్​. అప్లికేషన్​ దరఖాస్తుల సవరణ ప్రక్రియ నేడు, ఫిబ్రవరి 27 2026న ప్రారంభంకానుంది. అప్లికేషన్ ఫారమ్‌లలో పొరపాట్లు చేసిన అభ్యర్థులు వాటిని సరిదిద్దుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిబ్రవరి 27న 'కరెక్షన్ విండో'ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ వివరాలను మార్చుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 కరెక్షన్​ విండో ఫిబ్రవరి 28, రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ దరఖాస్తులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం ఉత్తమం.

ఈ అవకాశం రెండు రకాల అభ్యర్థులకు వర్తిస్తుంది:

సెషన్-1కు ...