భారతదేశం, జూన్ 15 -- Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్ల వేగం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. అయితే మూవీపై జాన్వీ కపూర్ సైలెన్స్ హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా మూవీ సక్సెస్ ను హీరో హీరోయిన్లు గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటారు. సినిమా కలెక్షన్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తారు. అయితే, ఇంతటి భారీ విజయాన్ని పెద్ది యూనిట్, అభిమానులు పండగలా జరుపుకుంటుంటే, హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం ఈ సక్సెస్‌కు పూర్తిగా దూరంగా ఉంటోంది. సినిమా సాధిస్తున్న రికార్డులపై ఆమె కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం ఇ...