భారతదేశం, మార్చి 17 -- దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నై ప్రాపర్టీని కాపాడుకునేందుకు ప్రొడ్యూసర్ బోనీ కపూర్, అతని కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ దగ్గర ఉన్న శ్రీదేవి ఆస్తికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ను కొట్టివేయడానికి చెంగల్పట్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నిరాకరించారు. ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఈ ముగ్గురూ ఇప్పుడు లీగల్ రూట్ తీసుకున్నారని 'లైవ్ లా' రిపోర్ట్ తెలిపింది.

సోమవారం (మార్చి 16న) జాన్వీ కపూర్, బోనీ కపూర్ వేసిన ఈ పిటిషన్ జస్టిస్ టీవీ తమిళసెల్వి ముందుకు వచ్చినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. కపూర్ ఫ్యామిలీ జాయింట్‌గా వేసిన ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌ను మార్చి 26, 2026న విచారించాలని జడ్జి నిర్ణయించారు. అప్పటివరకు డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే తదుపరి ప్రొసీడింగ్స్ అన్నింటిపైనా స్టే విధించ...