భారతదేశం, మే 18 -- Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ ముంబైలో ఘనంగా విడుదల చేసింది. ఈ వేడుకలో మాట్లాడిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తన పాత్ర గురించి, రామ్ చరణ్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్న విశేషాలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

తాను ముంబైలో ఉంటున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలే తన సొంత ఇల్లు అని జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి క్లాసిక్ చి...