భారతదేశం, మార్చి 16 -- హెయిర్ స్టైలిస్ట్ మార్సే పెడ్రోజో అకాల మరణం బాలీవుడ్ తారలను షాక్‌కు గురిచేసింది. వరుణ్ ధావన్ నుండి నోరా ఫతేహి వరకు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. సోమవారం (మార్చి 16) నాడు నటి జాన్వీ కపూర్ ఆ యువ హెయిర్ స్టైలిస్ట్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈవెంట్స్ బ్యాక్‌స్టేజ్‌లో మార్సే తన జుట్టును స్టైల్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలను జాన్వీ కపూర్ ఈ పోస్టులో పంచుకుంది. ఆమె తన నోట్‌లో ఇలా రాసింది..

"ఐ లవ్ యు మార్సీ. నేను వ్యాన్‌లోకి వెళ్ళిన ప్రతిసారీ మనం ఒకరినొకరం చూసుకుంటూ 'మన దగ్గర ఇంకా 20 నిమిషాలే ఉంది చలో చలో చలో' అని అరుచుకునే వాళ్లం. ఆ అసాధ్యమైన టాస్కులు, పిచ్చి పని వేళలు, ఆ గందరగోళం మధ్య మనం నవ్వుకునే వాళ్లం....