భారతదేశం, జూలై 27 -- అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2026-27కి సంబంధించి ఇన్​కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్​) దాఖలు చేయడానికి జులై 31 ఆఖరి తేదీ. గడువు సమయం దగ్గర పడుతుండటంతో.. గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రభుత్వం ఐటీఆర్ దాఖలు గడువును పెంచుతుందా? లేదా? అని పన్ను చెల్లింపుదారులు ఆలోచిస్తున్నారు.

గత ఏడాది ఐటీఆర్ ఫామ్‌లు ఆలస్యంగా రావడం, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం, పన్ను చెల్లింపుదారుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. కానీ, ఈసారి పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి.

ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఐటీఆర్ ఫామ్‌లను నిర్ణీత సమయానికే అందుబాటులోకి తెచ్చింది. వివిధ కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువు తేదీలను నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ-ఫైలింగ్ పోర్టల్ కూడా చాలా స్మూత్‌గా పనిచేస్తోంది. ఈ కారణాల వల్ల ఈసారి గడువ...