భారతదేశం, జూలై 17 -- భారత అంతరిక్ష రంగం సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న వేళ, ఇస్రో ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక లోపాలో, ప్రయోగాల వైఫల్యాలో కాదు.. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు సంస్థను వీడిపోతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని నెలల వ్యవధిలోనే 100 మందికి పైగా నిపుణులైన శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం అంతరిక్ష వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ సామూహిక నిష్క్రమణలను అడ్డుకునేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ (డీఓఎస్) నేరుగా రంగంలోకి దిగింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను ఇకపై సాధారణ పద్ధతిలో ఆమోదించకూడదని స్పష్టం చేస్తూ జులై 14న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దే...