భారతదేశం, మే 14 -- Irumudi: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యప్ప పడిపూజ జరిగినా కచ్చితంగా వినిపించే పాట.. ''మల్లెపూల పల్లకి''. ఈ పాట పాడుతూ అయ్యప్ప స్వాములు భక్తి తన్మయత్వంతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. ఇప్పుడీ పాపులర్ సాంగ్ సినిమాల్లోకిి రాబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం ఈ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారు.

రవితేజ హీరోగా నటిస్తున్న భక్తి నేపథ్య కథా చిత్రం 'ఇరుముడి'. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ భక్తి పాట 'మల్లెపూల పల్లకి' సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కన్ఫామ్ చేశాడు. అతను ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ''విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు'' అని జీవీ ప్రకాష్ పోస్టు చేశాడు.

అయ్యప్ప మల్లెపూల పల్లకి సాంగ్ కు థియేటర్లో పూనకాలు రావడం ఖాయమనే చెప్పాలి. ఈ ప్రముఖ అయ...