భారతదేశం, మార్చి 21 -- ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలను "విరమించుకునే" (వైండింగ్​ డౌన్​) అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో, ప్రపంచవ్యాప్త చమురు సరఫరా సంక్షోభాన్ని అరికట్టడానికి ఇరాన్ చమురు రవాణాపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది.

ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. "మధ్యప్రాచ్యంలో మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాం. మా గొప్ప సైనిక ప్రయత్నాలను వైండ్​ అప్​ చేసే దిశగా ఆలోచిస్తున్నాము," అని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలకు త్వరలోనే ముగింపు పలకవచ్చని ఆయన చేసిన ఈ పోస్ట్ బలమైన సంకేతాన్ని ఇచ్చింది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ దీనిపై స్పందిస్తూ.. "ఈ మిషన్ పూర్తి చేయడానికి సుమారు 4-6 వారాలు పడుతుందని అధ్యక్షుడు, పెంటగాన్ అంచనా వేశాయి. ...