భారతదేశం, మార్చి 3 -- సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద సోమవారం రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం భవనంపై నుంచి దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి వ్యాపించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో దాడులకు గురైన వాషింగ్టన్ దౌత్య కార్యాలయాల జాబితాలో ఇది తాజా చేరిక!

రియాద్‌లోని విదేశీ మిషన్లు ఉండే 'డిప్లొమాటిక్ క్వార్టర్'లో నల్లటి పొగ రావడాన్ని తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రెండు డ్రోన్ల ద్వారా అమెరికా ఎంబసీపై దాడి జరిగిందని, దీనివల్ల భవనానికి స్వల్ప నష్టం వాటిల్లడంతో పాటు చిన్నపాటి మంటలు చెలరేగాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ దాడిని, శనివారం నుంచి ఇరాన్ జరుపుతున్న దాడుల్లో ఆ...