భారతదేశం, ఏప్రిల్ 4 -- ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. అతని స్థానంలో టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబయి జట్టును నడిపిస్తున్నాడు.

శనివారం (ఏప్రిల్ 4) ఐపీఎల్ 2026 మధ్యాహ్నం మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ కు ముందు టాస్ సమయంలో హార్దిక్ పాండ్య బదులు సూర్యకుమార్ మైదానంలోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. హార్దిక్ కు ఏమైంది? అని కంగారు పడ్డారు.

టాస్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హార్దిక్ గైర్హాజరీపై స్పష్టతనిచ్చాడు. "హార్దిక్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న...