భారతదేశం, జూలై 31 -- INS Nipun : భారత సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యం, నావికాదళ సముద్ర భద్రతా సన్నద్ధత మరింత బలపడ్డాయి. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ 'హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్' (HSL) తమ నౌకా నిర్మాణ కేంద్రంలో రూపొందించిన అత్యంత ఆధునిక డైవింగ్ సపోర్ట్ వెసెల్ (DSV) 'నిపుణ్' నౌకను శుక్రవారం భారత నౌకాదళానికి అధికారికంగా అందజేసింది.

గతేడాదే 'ఐఎన్ఎస్ నిస్తార్' అనే నౌకను విజయవంతంగా తయారు చేసి భారత నావికాదళానికి అందించిన హిందుస్థాన్ షిప్‌యార్డ్. కేవలం ఏడాది వ్యవధిలోనే మరో సంక్లిష్టమైన యుద్ధనౌక 'నిపుణ్'ను పూర్తి చేసి రక్షణ రంగానికి అప్పగించడం విశేషం. స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం సాధిస్తున్న అపారమైన పురోగతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అత్యంత సంక్లిష్టమైన వ్యూహాత్మక నౌకా వేదికలను సమర్థవంతంగా నిర్మించడంలో హెచ్‌ఎస్‌...