భారతదేశం, జూన్ 21 -- Indian Team: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బిగ్ షాక్ ఇచ్చింది. సాధారణంగా ముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన ప్లేయర్ కు టీమ్ లో చోటు ఉంటుంది. కానీ నిన్ననే శతకం బాదిన యశస్వి జైస్వాల్ ను మాత్రం ఈ రోజే జట్టులో నుంచి తప్పించడం హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం (జూన్ 21) భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

నిన్న (జూన్ 20) అఫ్గానిస్థాన్ తో వన్డే మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. అజేయ సెంచరీ బాదాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడి, టీమిండియాను గెలిపించాడు. అలాంటి ప్లేయర్ ను టీమ్ లో నుంచి తప్పిస్తారని ఎవరైన...